ప్రపంచ గురువుగా ఎదురు చూసిన వ్యక్తి… అదే ప్రపంచానికి “నన్ను అనుసరించవద్దు” అని చెప్పినవాడు Jiddu Krishnamurti. మదనపల్లెలో జన్మించిన ఒక సాధారణ బాలుడు ప్రపంచ మేధావులను ఆలోచింపజేసిన తత్వవేత్తగా ఎలా మారాడో ఇదే ఆ కథ. మతాలు, గురువులు, సిద్ధాంతాలను తిరస్కరించి “సత్యం మార్గం లేని భూమి” అని ప్రకటించిన ఆయన, మన జీవితాన్ని కాదు… మన మనసును ప్రశ్నించమని సవాలు విసిరాడు. భయం, అసూయ, బాధ మనలోనే ఎలా పుడతాయో చూపిస్తూ, నిజమైన స్వేచ్ఛ మనలోనే ఉందని గుర్తుచేశాడు. వేలాది అనుచరులు ఉన్నా ఒక్కరినీ అనుసరించవద్దని చెప్పిన అరుదైన వ్యక్తి ఆయన. తత్వశాస్త్రం కాదు… జీవితమే ఒక పరిశోధన అని నిరూపించిన ఆలోచనకర్త. శాస్త్రవేత్తలతో, విద్యావేత్తలతో, సాధారణ మనుషులతో సమానంగా సంభాషించిన అతని మాటలు పుస్తకాల్లో మాత్రమే కాదు, మన రోజువారీ ఆలోచనల్లో మార్పు తీసుకురావడానికి విలువైన సూత్రాలు అని అనేకమంది నమ్ముతారు.. జిడ్డు కృష్ణమూర్తి జీవితం ఒక కథ కాదు… ప్రతి మనిషి తనను తాను తెలుసుకునే ప్రయాణానికి ఒక ఆహ్వానం. జిడ్డు కృష్ణమూర్తిగారి జీవనరేఖలు 19 వ భాగంః ఇందులో
Krishnaji Vs Rajagopal Vs Rosalind
Rajagopal querying Pupul and Nandini
Nadini's Cancer
Books by Krishnamurty
Emily Lutyens book controversy
Some more incidents happened in 1950 to 1954
మరిన్ని విశేషాలు 20 వ భాగంలో.
Podden och tillhörande omslagsbild på den här sidan tillhör
kiranprabha. Innehållet i podden är skapat av kiranprabha och inte av,
eller tillsammans med, Poddtoppen.