దేవతలు వచ్చి జైగీషవ్య మునిని పరీక్షించడం, ఆయన గొప్పతనం తెలుసుకుని వందనం చేయడం, జైగీషవ్య ముని అద్భుత స్తుతి చేయడం, అటుపై నారద మహర్షి వచ్చి సంభాషించడం. దేవతలు, నారద మహర్షి జైగీషవ్యుని తపస్సును గురించి చెప్పే వంకతో స్వామి దర్శనం చేసుకోవచ్చని కైలాసం వెళ్లారు (లేదంటే వీరు చెప్తే కానీ శివునికి తెలియకపోవడం ఉండదు కదా). అందరు కలిసి వెళ్లి కైలాసంలో అనేక ప్రాకారాలు దాటి, నందికేశ్వరుని ప్రార్ధించి శివ దర్శనం కోసం వచ్చాము అంటే, నందికేశుడు స్వామి ఆదేశం మేరకు వారిని దర్శనానికి పంపగా, నారదులవారు శివుని దర్శించి స్వామిని అద్భుతమైన స్తోత్రం చేస్తారు. జైగీషవ్య ముని గురించి చెప్పగా, స్వామి చాలా సంతోషించి, తాను దర్శనం ఇవ్వబోతున్నాని చెప్తారు